రాయపరెడ్డి కృష్ణ సౌజన్యంతో గిరిజన గ్రామానికి వాలీబాల్ కిట్

మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపరెడ్డి కృష్ణ తన సొంత నిధులతో మాడుగుల మండలంలో జాలంపల్లి పంచాయతీలో గొప్పుల పాలెం అనే గిరిజన గ్రామంలో ఉన్న యువకులకు క్రీడా ప్రోత్సాహకారంగా ఒక వాలీబాల్ కిట్ ను జాలంపల్లి పంచాయతీ నాయకులు కుంచాల హరే రామ్ నేతృత్వంలో వసంత్ కుమార్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గొప్పుల పాలెం గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. 300 యూనిట్లు దాటిందని చాలామంది వృద్ధులకు పింఛన్లు తీసేసారని, మేమంతా కరెంటు వినియోగించకపోయినా సరే భారీ మోతాదులో కరెంట్ బిల్లులు కూడా వస్తున్నాయని వారి యొక్క బాధను జనసేన నాయకులకు వివరించడం జరిగింది. కచ్చితంగా మీ గ్రామ సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాలంపల్లి పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు.