జనసేన జానీ ఆటోని సందర్శించిన నాదెండ్ల మనోహర్

శ్రీకాకుళం జిల్లా, జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమం జనవరి 12న రణస్థలంలో జరుగుతున్న సందర్భంగా స్థల ప్రాంగణాన్ని జనసేన పార్టీ రాష్ట్ర పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించడం జరిగింది. ఈ సందర్బంలో పాలకొండ నియోజకవర్గం జనసేన జానీ వారాహిని ప్రత్యేకంగా సందర్శించి చిన్న వారహిగా తీర్చిదిద్దిన జనసేన జానిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.