అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచిన అనుశ్రీ

  • రూపాయలు 5000/- తక్షణసాయం

రాజమండ్రి, స్థానిక 49 వ వార్డు లో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమవడం జరిగింది. వార్డు జనసేన నాయకులు అయినా నర్సిపూడి రాంబాబు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ దృష్టికి తీసుకురావడం జరిగింది. అనుశ్రీ వెంటనే స్పందించి బాధితులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం రూపాయలు 5000/- నగదు బాధితులకు తక్షణసాయం క్రింద అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు బాధితులకు కూరగాయలు, నిత్యవసర వస్తువులు అందజేశారు. జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపునీడి సూర్య 2000 నగదు బాధితులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ గెడ్డం నాగరాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నాడ శ్రీను, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శిలు అలాటి రాజు, విన్నవాసు, సంయుక్త కార్యదర్శి దేవకవాడి చక్రపాణి, పొట్నూరు శ్రీనివాస్ ఠాగూర్, మరియు జనసేన నాయకులు విక్టరీ వాసు, మంచాల సునీల్, ఖాన్, రాంబాబు, హేమదుర్గ, లోవరాజు దుర్గేష్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.