అగ్ని బాధిత కుటుంబానికి అండగా జనసేన కుటుంబం.. బండారు శ్రీనివాస్

కొత్తపేట: అగ్ని బాధ్యత కుటుంబాలను అన్ని రకాలుగా తాము ఆదుకోవడం మాత్రమే కాకుండా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం మడికి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం కాగా గళ్ళా నాగ వరలక్ష్మి, దేవరపూడి సత్యవతిలు నిరాశృలయ్యారు. ఇంట్లో ఉన్న దుస్తులు, వంట పాత్రలు, ఎలక్ట్రానిక్ సామాన్లు, బంగారు ఆభరణాలు, ఇటీవలే బ్యాంకు నుండి తీసుకున్న డ్వాక్రా నగదు మంటలకు కాలి బూడిదవ్వగా ఆస్తి నష్టం భారీగానే సంభవించింది. స్ధానిక జనసేన నాయకుల ద్వారా విషయము తెలుసుకున్న బండారు శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని, కొత్తపల్లి నగేష్ ఇరువురు 10000/- ఆర్ధిక సహాయం అందించారు. అలాగే ప్రభుత్వం నుండి రావలసిన సహాయం గురించి అగ్నిమాపక అధికారులు, తహసిల్దార్ లతో మాట్లాడి తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, బొక్క ఆదినారాయణ, ఉండ్రాజపు వెంకన్న, పంపన సురేష్, పేరపు దుర్గారావు, సెలప రెడ్డి పవన్, ఉండమట్ల అర్జున్, గంగరాజు, కొత్తపెళ్లి బుజ్జి యా, మద్ది రెడ్డి రాజు, దుర్గారావు జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.