Eluru: జనసేనలో చేరికలు

రాష్ట్ర వ్యాప్తంగా జనసేనపార్టీ గాలి వీస్తోంది. నిత్యం ఏదో ఒక మూల వందల సంఖ్యలో ప్రజలు జనసేన గూటికి చేరిపోతున్నారు. పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీపావళి పర్వదినాన పశ్చిమ గోదావరిజిల్లా కేంద్రం ఏలూరులో 200 మంది జనసేనపార్టీలో చేరారు. నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ శ్రీ రెడ్డప్పలనాయుడు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పట్టణ అధ్యక్షులు శ్రీ కాశీ నరేష్, మండల అధ్యక్షులు శ్రీ వీరంకి పండు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఇళ్ల శ్రీనివాస్, శ్రీ జానపద తేజ ప్రవీణ్, శ్రీ రాజు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.