జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం చేయండి: గుడివాడ జనసేన

గుడివాడ నియోజకవర్గం: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం (11-3-23) ఉదయం 11 గంటలకు గుడివాడ లోని బంటుమిల్లి రోడ్ లోని వ్యాపారస్తులను కలిసి కరపత్రాలు ఇచ్చి మార్చి 14 జరుగు ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి ఆవిర్భావ సభ పోస్టర్లు ఆవిర్భావ సభ సమన్వయకర్తలు పెదపూడి విజయ్ కుమార్, రత్నం అయ్యప్ప, బూరగడ్డ శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర్ రావు, మజ్జి శ్రీనివాసరావు, ఇంటూరి గజేంద్ర, వేమూరి త్రినాథ్, సాయిన రాజేష్, బుడమా రాజు, శాంతి నాయుడు, సుంకరర వెంకట్, వైయస్సార్, బాను, తదితరులు పాల్గొన్నారు.