పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన

కాకినాడ ముత్తా క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పర్యటనకు సంబంధించి విషయాలు (మత్స్యకారులకు బాసటగా జనసేన తదితర కార్యక్రమాలు గురించి) జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులు అందరికీ మత్స్యకార భరోసా పారదర్శకంగా అమలు చేయాలని, వేట విరామం సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే 10వేల రూపాయలను 30 వేల రూపాయలకు పెంచాలి, డీజిల్ సబ్సిడీని కూడా పెంచాలని కోరుతూ 28వ తారీఖున నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కాకినాడ మత్స్యకార జేడికి వినతి పత్రం అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసి సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తం శశిధర్, పిఠాపురం ఇంచార్జి మాకినీడి శేషుకుమారి, పెద్దాపురం ఇన్చార్జ్ తుమ్మల బాబు, జగ్గంపేట ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, ప్రత్తిపాడు ఇన్చార్జి వరుపులు తమ్మయ్యబాబు, రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ, కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శిలు మొగలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, మండల ప్రెసిడెంట్ అమరాధి వల్లి రామకృష్ణ, పట్టా శివ, గోపు సురేష్, బుర్రా సూర్య ప్రకాష్ రావు జనసేన పార్టీ జిల్లా నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.