రైతుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకోవస్తారని భరోసా

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం పరిధిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జనసేనశ్రేణులతో నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం స్వయంగా రైతుల దగ్గరికి వెళ్లి పంట నష్టాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో ఆర్ బి కే సెంటర్లు, సంచులు ఇవ్వకపోవడం వల్లే మా ధాన్యం మొలకెత్తి పోయిందని, ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు మద్దతు రేటుకే చేసే విధంగా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఇలాంటి సమయాల్లో పవన్ కళ్యాణ్ రైతుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకోవస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు కొప్పిశెట్టి మంగరాజు, కరిబండి వెంకటేశ్వరావు, మరియు కస్తూరి వెంకట సుబ్బారావు, ఉప్పులూరి వాసు, బండారు సతీష్, ఉల్లి రమేష్, కాట్రెడ్డి మంగరాజు తదితరులు పాల్గొని అన్యాయం జరిగిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు.