కె.పి.హెచ్.బి లో చలివేంద్రంలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

కూకట్ పల్లి నియోజకవర్గం కె.పి.హెచ్.బి కాలనీలో తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి, తెలంగాణ వీరమహిళా వైస్ ప్రెసిడెంట్ నిహారిక, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రెటరీ నందగిరి సతీష్ కుమార్ విచ్చేసి కె.పి.హెచ్.బి లో ఉన్న చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్ల శంకర్, జనసేన పార్టీ వీర మహిళా ఆర్గనైజ్ సెక్రటరీ భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, 121 డివిజన్ ప్రెసిడెంట్ మహేష్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.