మామిడాడలో జనం కోసం జనసేన 511వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 511వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 78700 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి వెంకట సూర్యారావు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి కర్రి గాంధి, మామిడాడ నుండి దెయ్యాల భద్ర, బొడ్డేటి శ్రీనివాస్, దాడి భద్రరావు బూరుగుపూడి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, రామవరం నుండి కత్తి లోవయ్య, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మామిడాడ గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన పూసల కుమార్ కుటుంబ సభ్యులకు, దెయ్యాల భద్ర కుటుంబ సభ్యులకు, కర్రి గాంధీ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.