పట్టణ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించిన నూజివీడు జనసేన

నూజివీడు పట్టణంలో తక్షణమే జీ ప్లస్ త్రీ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలని నూజివీడు పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నూజివీడు పట్నంలో మహనీయుల పేరుమీద ఏర్పాటు చేసిన పార్కులను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ నూజివీడు జనసేన పార్టీ తరపున నూజివీడు మున్సిపల్ కమిషనర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ రషీద్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరీదు శివరామకృష్ణ , తోట వెంకట్రావు, ముత్యాల కామేష్, ఏనుగుల చక్రి, ముమ్మల్నినెేని సునీల్ కుమార్, యర్రంశెట్టి రాము, ఇంటూరి చంటి, ఆరేళ్ల కృష్ణా, వలసపల్లి రామకృష్ణ , ఉమా మహేశ్వరి, సిరి పావని, కొన్నంగుంట రాంబాబు, యాదల వెంకటేశ్వర్రావు, యూస్మార్ట్ ఉమా తదితరులు పాల్గొన్నారు.