రాష్టాన్ని జగనసుర గ్రహణం నుండి ప్రజల్ని కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ కే ఉంది: గాదె

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్టానికి పట్టిన గ్రహణం అని… దాన్ని వదిలించి రాష్ట్ర ప్రజలను కాపాడే శక్తీ ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. అకాల వర్షాలతో రాష్ట్రములో రైతులు పరిస్థితి చాలా దారుణంగా ఉంటె ముఖ్యమంత్రికి చీమకుట్టునట్లు కూడా లేదని తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాలేదని విమర్శించారు. జనసేన అధినేత రైతులకు అండగా నిలబడితే తగుదునమ్మా అంటూ పాలేరు మంత్రులు పనిగట్టుకుని ఎగేసుకొని మైకులు ముందు వచ్చి వాగుతున్నారని అన్నారు. మీకు చిత్త శుద్ధి ఉంటె రైతులను త్వరగా ఆదుకోవాలని అన్నారు. రైతులకు కనీసం నీటి వసతి కల్పించకుండా. వారి కష్టాలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ని తిట్టడమే అంబటి రాంబాబు పనిగా పెట్టుకున్నాడని. గాదె అన్నారు. పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసి. నేరేడు తోటల్లో రెస్ట్ తీసుకునే నీకు కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్తితి ఉందని అన్నారు. కనీస మద్దతు ధర ఇస్తానని చెప్పి ఈ రోజున ప్రభత్వం చేతులెత్తేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామ చంద్ర ప్రసాద్, శిఖా బాలు, దాసరి వెంకటేశ్వరరావు, నెల్లూరు రాజేష్, హుస్సేన్, తన్నీరు గంగరాజు, నాయకులు కార్యకర్తలు పాలోన్నారు.