ఆర్థిక సహాయం చేసిన బొర్రమాంబ ఉప్పర కాలనీ జనసైనికులు మరియు జీవీఎంసీ 85 వార్డ్ ఇంచార్జ్ శ్రీ గవర సోమశేఖరరావు

తేదీ 21 నవంబర్ 2021 న గత కొంతకాలంగా వింత వ్యాధి వలన బరువు తగ్గుతూ 56 కేజీలు నుంచి 36 కేజీలకు వచ్చి నీరసించి పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద అయిన చట్టివాని పాలెం వాస్తవ్యులు ప్రస్తుతం మంగళ పాలెం జే ఎన్ యు ఆర్ ఎం కాలనీలో అద్దెకు నివసిస్తున్న శ్రీ నాగేష్ కుటుంబానికి బొర్రమాంబ ఉప్పర కాలనీ జనసైనికులు తరఫున జనసేన పార్టీ జీవీఎంసీ 85వ వార్డ్ ఇంచార్జ్ శ్రీ గవర సోమశేఖరరావు చేతుల మీదుగా ఋస్.15000/- రూపాయలు నగదును మరియు ఒక నెలకు సరిపడా రేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఆ కుటుంబానికి రేషన్ ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొర్రమాంబ ఉప్పర కాలనీ జనసేన నాయకులు శ్రీ మాధవ్, శ్రీ రమణ, హరి, విజయ, లక్ష్మణ, వంశీ, రాము, బాలాజీ, దిషేత్, దేముడు, నాయుడు, చరణ్, హరి కృష్ణ, కిషోర్, శివ, రమేష్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.