నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ యానం గ్రామంలో కర్రా వీర వెంకట నాగేశ్వరరావు చిన్ని వారి సాయి గణేష్ హోం నీడ్స్ మరియు ఫర్నిచర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. యాజమాన్యం వారు పితాని వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందజేసి చిరు సత్కారం చేసి గౌరవించారు. అలాగే ఐ పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో శ్రీ వైష్ణవి దుర్గ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి వారి ఆశీస్సులు పొందారు అలాగే ఐ.పోలవరం మండలం, మురమళ్ళ, అప్పన్న చెరువు గ్రామంలో శ్రీ విజయ దుర్గమ్మ వారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు ముమ్మిడివరం మండలం మట్టాడిపాలెం గ్రామంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామం దంగేటి వారి పాలెం దుర్గమ్మ వారి ఆలయం దగ్గర అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, తాళ్ళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, గుద్దటి విజయ్, పెన్నాడ శివ, సుందరంపల్లి సత్యనారాయణ, సలాది రాజా, చిట్టూరి దొరబాబు, కోలా నారాయణరావు, సాధనాల భాస్కరరావు, కోలా పండు, విత్తనాల అర్జున్, విత్తనాల రామ్మోహన్ రావు, కడలి శ్రీను, దంగేటి అన్నవరం, కోలా ఉదయభాస్కర్, కోలా నాని తదితరులు పాల్గొన్నారు.