అంగనవాడిల సమ్మెకు మద్దతుగా బొబ్బేపల్లి

  • సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి: అంగనవాడిల సమ్మెకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది లేదు. అదేవిధంగా న్యాయబద్ధంగా అంగనవాడి టీచర్లు అంగన్వాడి ఆయాలు 10 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఇప్పటివరకు దానిపైన పూర్తిస్థాయిలో స్పందించిన దాఖలాలు అందుకు నిరసనగా వాళ్లు చేస్తున్న నిరవధిక నిరసన దీక్షకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా వారు చేస్తున్న నిరసన దీక్షకి వాళ్ళ సొంత డబ్బులతో టెన్టు వేసుకొని ఇబ్బంది పడుతున్నారు. అందుకుగాను మూడు రోజులపాటు టెంట్ కి ఖర్చులు మేం బరాయిస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంగనవాడి ఆయాలుగా బీఈడీ చేసి అందులో పని చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు ఈరోజు రాష్ట్రంలో పెరిగిన కరెంట్ బిల్లులు పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు పెరిగిన ఆర్టీసీ చార్జీలు పెరిగిన ఇసుక ఇలా చెప్పుకుంటూ పోతే పెరిగిన గ్యాస్ పెరిగిన పెట్రోల్ డీజిల్ అనేక విధాలుగా ప్రజలపైన భారం మోపి అంగనవాడి వాళ్లకి కనీస జీతాలు పెంపు లేకుండా వాళ్ళ పైన భారాన్ని పెంచి కనీసం వాళ్ళకి రిటైర్మెంట్ గాని ప్రభుత్వం నుంచి పథకాలు అందడం గాని ఏవి జరగకపోవడం ఉద్యోగానికి భద్రత లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రేపు 2024లో ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలుపుతూ వెంటనే ప్రభుత్వము చర్చలు జరిపి వాళ్ల డిమాండ్ల పరిష్కరించాలని కోరుతున్నాం అని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ గుమ్మినేని వాణి భవాని మండల కార్యదర్శి శ్రీహరి, ఐటి విభాగం పసుపులేటి ప్రసాద్, పొదలకూరు మండల అధ్యక్షుడు అనిల్, తదితరులు పాల్గొన్నారు.