అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్ధికసాయమందించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం 17వ వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న గుత్తుల వెంకటేశ్వరరావుని పరామర్శించి 2000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరియు అదే గ్రామానికి చెందిన కాలు ఆపరేషన్ చేయించుకున్న గుత్తుల శివని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సాన బోయిన మల్లికార్జున రావు, కడలికొండ ఎలమంచిలి బాలరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.