క్రియాశీలక సభ్యుని కుటుంబానికి ఐదు లక్షల చెక్కును అందజేసిన నాదెండ్ల

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, కత్తులవాని పాలెం గ్రామానికి చెందిన పన్నమనేని మీర నాగ ఆంజనేయులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కనుక పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన బీమా సౌకర్యం ద్వారా ఐదు లక్షల రూపాయల చెక్కును జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. జనసైనికుల కుటుంబ భద్రత కోసం ఎంతో ముందు చూపుతో బీమాను ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. మృతుని కుటుంబానికి చెక్కు అందజేసిన నాదెండ్ల మనోహర్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెపియజేసారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెడన నియోజవర్గ జనసేన పార్టీ నాయకులకు, జిల్లా కమిటీలకు, మండల కమిటీలకు, జనసైనికులకు వీర మహిళలకు, నియోజకవర్గ ప్రజలకు, కత్తలవాని పాలెం గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీస్ సోదరులకు పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.