పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కొప్పిగుంట గ్రామంలో ఇటీవల ఉరి వేసుకొని చనిపోయిన మేడిశెట్టి వినయ్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అనంతరం కందికుప్ప గ్రామానికి చెందిన దంగేటి సత్యనారాయణ గారు ఇటీవల మరణించగా వారి కుమారులను కలిసి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అదేవిధంగా పల్లంకూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కసిరెడ్డి వినయ్ మరణించగా వారి తండ్రి కసిరెడ్డి రెడ్డి నాయుడుని కలసి పరామర్శించి ఓదార్చారు. అలాగే భక్కి వారి పేట గ్రామానికి చెందిన వరసాల సింహాద్రి ఇటీవల మరణించగా వారి భార్య కుమారులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి వెంట మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూకల దుర్గ బాబు మండల కార్యదర్శులు పిల్లి గోపి సంసాని పాండురంగారావు కాలాడి రాజు ఓగూరి నూతన బాబు, ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, కసిరెడ్డి మణికంఠ, అమర సాయి, బల్ల కుమార్, యనమదల ఉమామహేశ్వరరావు, దొమ్మేటి రాధాకృష్ణ, వనచర్ల నాగేశ్వరరావు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు.