ఢిల్లీలోని నెయిల్ పాలిష్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్లాస్టిక్, నెయిల్ పాలిష్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు, పలువురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఫైరెమ్న్కి కూడా తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. ప్రతాప్ నగర్లోని నెయిల్ పాలిష్ కంపెనీలో తెల్లవారుజామున 3.47 గంటలకు మంటలు చెలరేగాయని.. వెనువెంటనే భవనాన్ని చుట్టుముట్టాయని అన్నారు. 28 ఫైరింజన్లు ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారని అధికారులు వెల్లడించారు. కాగా, కంపెనీలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.