రాజుపాలెంలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం రాజుపాలెం మండలం, రాజుపాలెంలో మండల ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు, సత్తెనపల్లి పట్టణ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, సిరిగిరి మణికంఠ, మండల ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, అంచుల అనేష, ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, గ్రంధి సదాశివరావు, వాలంటీర్ తంబిశెట్టి మహేష్, బ్రాహ్మణపల్లి గ్రామ అధ్యక్షులు గ్రంధి బాలాంజనేయులు, అంకాల డేవిడ్, తోట నాగేశ్వరావు, తోట మణికంఠ, లింగంపల్లి కొండ, పగడాల నరసింహారావు, చెవుల ఆంజనేయులు, అప్పికట్ల శీను, మేడి హరిబాబు, దంతాల వెంకటేష్, కొచ్చర్ల అంజి తదితరులు పాల్గొన్నారు.