మోపిదేవి జనసేన అధ్వర్యంలో విద్యార్ధులకు ఘన సన్మానం

అవనిగడ్డ, మోపిదేవి మండలం పరిథిలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్ లో పదవ తరగతి ఫలితాలలో మొదట – ద్వితీయ స్థానాలలో మార్కులు సాధించిన విద్యార్ధిని విద్యార్థిలతో పాటు వారి తల్లిదండ్రులను మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్వర్యంలో ఆదివారం మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ అధ్యక్షతన ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ నాయకులు ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణు గోపాల్ విచ్చేసి విద్యార్ధులను అభినందించి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రసంగించారు. అలాగే మోపిదేవి మండల స్థాయి నాయకులు కామిశెట్టి శ్రీనివాసరావు, అర్జా కిరణ్ కాంత్, నాయకురాలు అర్జా రాధికా, భాదర్ల లోలాక్ష నాయుడు, మండల కమిటీ ఉపాధ్యక్షులు మెరకనపల్లి నరేష్, భోగిరెడ్డి సాంబశివరావు, యడ్లపల్లి అజయ్ మండల కమిటీ సభ్యులు ఆకుల పవన్ కళ్యాణ్, శాఖమూరి బాలాజీ, గ్రామ నాయకులు బాచు శ్రీనివాస్, యర్రంశెట్టి సునీల్, తలుపుల గోపాల్, మత్తి వంశీ, మత్తి శివకోటయ్య, మత్తి శివ నంది, జనసైనికులు చావకుల సురేష్, యర్రంశెట్టి సుబ్బారావు, కూరేటి జగన్, సనకా శశి, రాఘవ కూరేటి మరియు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.