పరిజెల్లపేట గ్రామంలో “జనం కోసం జనసేన మహాపాదయాత్ర”

రాజానగరం నియోజకవర్గం, సోమవారం రాజానగరం జనసేన నాయకులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జనం కోసం జనసేన మహాపాదయాత్ర” పరిజెల్లపేట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసంద్రం అయిన పరిజెల్లపేట గ్రామం. రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులకు పూల వర్షాలతో పరిజెల్లపేట గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికడం జరిగింది. రాజానగరం మండలం పరిజెల్లపేట గ్రామంలో ఉదృతంగా కొనసాగిన జనం కోసం జనసేన మహాపాదయాత్ర. సుమారు 500 బైక్లు, 100 కార్లతో రాజానగరం సెంటర్ నుండి పరిజెల్లపేట గ్రామం వరకు జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి భారీ బైక్ ర్యాలీగా బయల్దేరి దారి పొడుగునా భారీ బాణాసంచా పేల్చుతూ జనసైనికుల కోలాహలం నడుమ బైక్ ర్యాలీగా జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గ్రామం చేరుకోవడం జరిగింది. గ్రామంలోని శివాలయం వద్ద నుండి పాదయాత్ర ప్రారంభించి గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన పాదయాత్ర. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, పరిజెల్లపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.