పంచాయతీ నిధుల మల్లింపులను నిరసిస్తూ బొర్రా ఆధ్వర్యంలో మహా నిరసన

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ అధిష్టానం పిలుపుమేరకు గురువారం ఉదయం పల్నాడు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచ్ ల హక్కుల కోసం తలపెట్టిన దీక్షకు సంఘీభావంగా నరసరావుపేటలోని ఏంజెల్ టాకీస్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ సెంటర్ నందు సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్ర వెంకట అప్పారావు సంఘీభావం తెలిపి పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసు నందు కలెక్టర్ కు జనసేన పార్టీ తరపు నుండి వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, అద్దేపల్లి ఆనంద్ కుమార్, చిలక సత్యం నియోజకవర్గం జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.