నవ్వనంపాడులో జనసేన విస్తృత స్థాయి సమావేశం

శ్రీకాకుళం: పొన్నం పంచాయతీ, నవ్వనంపాడు గ్రామం జనసేన రూరల్ మండల అధ్యక్షుడు తాట్రాజుల కుర్మారావు ఆధ్వర్యంలో కోరడ సర్వేశ్వరరావు నేతృత్వంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా విచ్చేసిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ కోరాడ సర్వేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ విజయానికి యువతరం, పెద్దలు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరి తాలూకా కృషితోనే జనసేన విజయభేరి సాధించగలమని సభా ముఖంగా తెలియజేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు బమ్మిడి సిద్దు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఓటు విలువైనదని, దానిని మనం ప్రతి క్షణం జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఓటును మనం కాపాడుకున్నప్పుడే అప్పుడే ప్రతి సామాన్యుడికి న్యాయం జరుగుతుందని సభ ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మడ వెంకటేష్, ఊట మల్లేశ్వరరావు, వర, పెద్దపాడు శంకర్, రమేష్, రామకృష్ణ, రాంబాబు, చిట్టి భాస్కర్, ముంగు జగదీష్ తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.