సైదాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనాన్ని మంజూరు చేయాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రి పైభాగం కప్పు పెచ్చులు ఊడిపోయి, శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై స్థానిక నియోజకవర్గ ఎమ్.ఎల్.ఏ గారు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆసుపత్రికి నూతన భవనాన్ని మంజూరు చేయించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేన పార్టీ తరపున దిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు సైదాపూర్ మండల నాయకులు పొడి శెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, అనగోని అంజి, పొడి శెట్టి శ్రీనివాస్, బత్తుల శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.