పింఛన్లు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి: జనసేన డిమాండ్

అమలాపురం: పేదవారికి, వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులకు జీవనాధారమైన పింఛన్లు తొలగించి వారి జీవన భద్రతకు గండి కొట్టవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమలాపురంలో జనసేన పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేసారు. అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పిలుపుమేరకు, నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలాలలో మరియు అమలాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసైనికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ప్రభుత్వ అధికారులకు విజ్ఞాపన పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర జిల్లానాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.