క్రియాశీలక కార్యకర్తకు బీమా చెక్కు అందజేసిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, కొప్పుకుంట గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త మట్టపర్తి వెంకటరమణ ఇటీవల యాక్సిడెంట్ గురైనారు. మట్టపర్తి వెంకటరమణకు క్రియాశీలక సభ్యత్వం ఉన్నందున ఇన్సూరెన్స్ క్లెయిమ్ శాంక్షన్ కాగా, జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ 35 వేల రూపాయలు చెక్కును రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కు పంపించి, వెంకటరమణకు అందజేవలసినదిగా సూచినచారు. ఈ మేరకు పితాని బాలకృష్ణ బుధవారం వెంకటరమణకు 35 వేల రూపాయలు చెక్కును అందజేసారు.