ప్రజా సేవకుడ్ని గెలిపించుకోవాలి – జానీ మాస్టర్

తాడేపల్లిగూడెం: నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే నాయకుడిని గెలిపించుకోవాలని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో జానీ మాస్టర్ పాల్గొన్నారు. జనసేన పార్టీ స్టార్ క్యాంపనర్ గా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తరపున జానీ మాస్టర్ ప్రచారం చేపట్టారు. అడుగడుగున జానీ మాస్టర్ బోలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. స్టార్ కాంపైనర్ జానీ మాస్టర్ మాట్లాడుతూ అధికారం లేకపోయినా పేద ప్రజలకు నిశ్వర్ధంగా సేవ చేయటం బొలిశెట్టి శ్రీనివాసును పలువురు ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు. కరోనా సమయంలో అయిన చేసిన సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు. బొలిశెట్టి శ్రీనివాస్ కి వస్తున్న ప్రజధారణ చూస్తుంటే గెలుపు కాయం అని తెలిపారు.