సింగరాయకొండ మండల జనసేన నాయకుల ముందస్తు అరెస్టు

ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘిభావ మద్దతు ప్రకటించింది. ఈ నేపధ్యంలో సోమవారం సింగరాయకొండ మండల ‌టీడీపీ శ్రేణులతో కలిసి శాంతియుతంగా సింగరాయకొండ మండలం పది గ్రామాల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, భారీ సంఖ్యలో పాల్గొని బంద్ చేపట్టాలని ఆలోచనలో ఉన్న సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ భాష, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, కిచ్చేంశెట్టి ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు సయ్యద్ సుభని, చెవురి అరుణ్ కుమార్, జనసేన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన సింగరాయకొండ ఎస్.ఐ, టి. శ్రీరామ్.