మెగా ఫ్యామిలీకి నిజమైన పండగ.. మేనమామల నడుమ చిరునవ్వులు చిందిస్తున్న సాయి తేజ్

మెగా హీరో సాయి తేజ్ గత సెప్టెంబరు నెలలో రోడ్డు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత సాయి తేజ్ మీడియాకు కనిపించలేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత తన నివాసానికే పరిమితం అయ్యాడు. ఇన్నాళ్లకు సాయి తేజ్ పబ్లిగ్గా దర్శనమిచ్చాడు. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు విచ్చేశాడు.

దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నాడని మెగాస్టార్ వెల్లడించారు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో చిరంజీవి… తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చెయ్యేసి ఉండగా, పక్కనే పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్ ఉన్నారు.