సఖి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమం

పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సఖి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు. లయన్స్ సఖి క్లబ్ సభ్యుల సహాయక దృక్పథాన్ని ఆమె కొనియాడారు. లయన్స్ సఖి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో పేషెంట్లకు ఆహారం పంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరం, తను కూడా సఖి క్లబ్ లో భాగస్వామ్యం కావడం నాకు ఆనందదాయకం, పిఠాపురం నియోజవర్గంలో సఖి క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు క్లబ్ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి సమాజానికి సఖి క్లబ్ ద్వారా మహిళలు సేవ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సఖి ప్రెసిడెంట్ అరుణ కుమారి, సభ్యులు నాగలక్ష్మి, అమ్మాజీ, రమణి, జిల్లా జనసేన నాయకులు మొగలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, బుర్రా సూర్యప్రకాష్, మేళం రామకృష్ణ, కసిరెడ్డి నాగేశ్వరరావు, కొనమంచిలి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.