పి.గన్నవరం జనసేన అధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలంలో శుక్రవారం ఉదయం 10గంటలకు అంబాజీపేట మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబాజీపేట ఆర్ టి సి బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ 72 వ రాజ్యంగ సమర్పణ దినోత్సవం సందర్భంగా డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మండల పార్టీ అధ్యక్షులు దొమ్మేటిసాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు గౌ శ్రీ శిరిగినీడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… 2014లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రములో అధికారంలోకి వచ్చిన గౌ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నవంబర్ 26 – 1946లో డా. బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టిన రోజును అన్ని రాష్ట్ర శాశన సభల్లో ఆనాటి అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని, ఆయన అందించిన గొప్ప రాజ్యాంగాన్ని ,రాజ్యాంగ గొప్పతనాన్ని స్మరిస్తూ ఆ మహా మేధావిని గౌరవించేలా చర్చించాలని నిర్ణయం తీసుకోవటం అంబేద్కర్ మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేస్తుంది అనీ కొనియాడారు. 2014 నుండి ఇప్పటివరకూ నవంబర్ 26 ను రాజ్యాంగ సమర్పణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

జనసేన అధినేత గౌ శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అంబేద్కర్ ఆశయాలు వారి ఆలోచన విధానాలను వారి అడుగు జాడలలో నడవాలని శ్రీ పవన్ కళ్యాణ్ జనసైనిలకు పిలుపును ఇవ్వడమైది జనసైనికులకు తూ”చా”తప్పకుండా ప్రజా క్షేత్రంలో అడుగుల వేయాలని సుచించారు. సమర్పణ కార్యక్రమంలో సుంకర పేరయ్య నాయుడు,ములపర్తి రమేష్, చింతపల్లి సితారామ స్వామి , యర్రంశెట్టి నాగేంద్ర, అరిగెల సూరిబాబు, కొర్లపాటి వెంకటేశ్వరరావు(డిల్లీ), మైపాల తాతాజీ, పెచ్చెట్టి గోపి, మట్టపర్తి కృష్ణ మూర్తి, రవణం విజయ్, వీరా వీరబాబు, యర్రంశెట్టి జగదీష్, మహ్మద్ షబానా, తదితరులు పాల్గొన్నారు.