గుంటూరు జిల్లా బాపట్ల: జనసేన అధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

గుంటూరు జిల్లా బాపట్ల స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ… అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి. ల, మత, ధన బేధాలు లేకుండా భారతదేశ ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కల్పించడానికి అహర్నిశలు ప్రయత్నించి యావత్ భారతదేశాన్ని ఒకతాటిపై నడిచేలా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి మరువలేనిది. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 72 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొట్రా మణికంఠ, ఉసా ప్రసాద్, ఆరమళ్ళ సుజిత్,గంటా నాగమల్లేశ్వరరావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.