గుంతల ఆఁధ్రప్రదేశ్ కి దారేది??

  • వైసిపి చేతకాని పరిపాలనకు రహదారులే నిదర్శనం: జనసేన – టీడీపీ

శింగనమల నియోజకవర్గం: నార్పల మండలం, జనసేన- తెలుగు దేశం నాయకుల ఆద్వర్యంలో రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. మండలంలో గుంతలు పడి అధ్వానంగా తయారై, ప్రమాదాలకు కారణం అవుతున్న రోడ్లను పరిశీలించారు. ఆంధ్ర ప్రదేశ్ కు దారేది సంయుక్త కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బి. పప్పూరు గ్రామ సమీపంలో గల ఇరుకైన వంతెనతో పాటు ప్రమాదకరంగా గుంతలు పడిన రోడ్డుని చూపిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. వైసీపీ చేతకాని పరిపాలనకు రాష్ట్రంలోని రహదారులే నిదర్శనమని మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, జనసేన నాయకులు తుపాకుల భాస్కర్ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితి పై ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరిచ్చిందని మండిపడ్డారు. కేవలం ప్రజారార్భాటాలకే పరిమితమైన వైసిపి ముసుగు తొలగించే వరకు జనసేన టిడిపి సంయుక్తంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. రోడ్ల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష పాలనకు నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, షేక్ రహం తుల్లా, వినోదం నారాయణస్వామి, ఉట్టి నరసింహులు, వినోదం లోకేష్, శరత్, టీడీపీ మండల కన్వీనర్ ఎర్రినాగప్ప, చంద్ర బాబు, పి. లక్ష్మి నారాయణ, కుళ్లాయప్ప, నగేష్ మరియు పెద్ద ఎత్తున జనసేన, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.