ఆధార్ కేంద్రాలను వెంటనే పెంచాలి: జనసేన డిమాండ్

ముదోల్ నియోజక వర్గంలో ఆధార్ కేంద్రాలను పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన తరఫున జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు విజ్ఞప్తి చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలకు, ఆరు గ్యారంటిల హామీలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కావడంతో మీసేవ కేంద్రాల వద్ద రద్దీ పెరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నియోజక వర్గంలో సరిపడా కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు టోకెన్ల కోసం కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారని మహేష్ బాబు కోరడం జరిగింది.