నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

నరసాపురం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కేసరి నాగులు అలాగే గొంది మూలకు చెందిన బొక్కా రాంబాబు, బొక్కా సురేష్, కడలి పవన్ కుమార్, కవురు శివగణేష్, మల్లుల కుమార్ బాలాజీ, గుబ్బల సూరిబాబు, దొంగ వెంకీ మరియు నరసాపురం పట్టణానికి చెందిన కొల్లు వెంకటేష్, రామాని రాజు, బొర్రా సురేష్, బర్రి శ్రీనివాస్, ముంత చరణ్, ముంత సందీప్, గుత్తులు శ్రీనివాస్, సేమామంతుల శ్రీరామ్ అలాగే దాదాపుగా 100 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి నాయకర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, గంటా కృష్ణ, గుబ్బల మార్రాజు, తోట నాని, తిరుమాని సీతామహాలక్ష్మి,బెల్లంకొండ నాయుడు, కొప్పాడి శ్రీను, ఓడుగు ఏసు, పొన్నమండ ముత్యాలరావు, వనమాలి శ్రీను, వాతాడి రమేష్, బొడ్డు క్రాంతి కుమార్, పర్వతం నవీన్, తమ్మిశెట్టి నవీన్, దేవరపు బాబీ, ఓలేటి దేవి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.