అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఆచంట జనసేన

ఆచంట నియోజకవర్గం, కరుగోరుమిల్లి గ్రామం ముత్యాలవారి పాలెం కాలనీలో కుక్కల శ్రీనివాస్ రాజు తాటాకు ఇళ్ళు గత మూడురోజులు క్రితం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్జ్యూట్ వలన పూర్తిగా దగ్ధమవడం జరిగింది. శుక్రవారం జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యాన్నిచ్చి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర కిరాణా సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ మాట్లాడుతూ మున్ముందు మీ కుటుంబానికి మరింత ఆర్థిక సహాయం అందేలా జనసేనపార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ, కుక్కల శ్రీనివాస్ రాజు కుటుంబం విద్యుత్ షార్ట్ సర్జ్యూ వల్ల తీవ్రంగా నష్ట పోయారని కాబట్టి రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయుకులు కడిమి ఉమా మహేశ్వరస్వామి, ఏడిద బాలు మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *