అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు జనసేన మద్దతు

పాడేరు: జి. మాడుగుల మండలలో ఎనిమిది రోజులుగా మండల పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయాలు చేస్తున్న న్యాయబద్ధమైన వారి యొక్క హక్కులు కోసం వివిధ డిమాండ్స్ తో పోరాటం చేస్తున్న సందర్భంలో జి మాడుగుల మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మసాడి భీమన్న ఆధ్వర్యంలో జి మాడుగుల మండల జనసేన పార్టీ నాయకులతో కలిసి అంగన్వాడీ కార్యకర్తలకు మరియు ఆయాలకు, జి మాడుగుల మండల జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు పలకడం జరిగినది. మీరు చేసే పోరాటంలో నిజాయితీ ఉంది కావున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ మరియు పాడేరు సమన్వయ కర్త గౌరవ డాక్టర్ వంపూరు గంగులయ్య, జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్తలకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడం జరిగినది. కావున జి మాడుగుల మండల జనసేన పార్టీ తరఫున మండల జనసేన పార్టీ మీకు పూర్తి మద్దతిస్తుందని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు ఉపాధ్యక్షుడు సాగిని ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శి గొంది మురళి ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక శాఖ సభ్యులు తాంగుల రమేష్ మండల బూత్ కమిటీ కో కన్వీనర్లు సీనియర్ నాయకులు మసాడి సింహాచలం బుజ్జిబాబు, త్రిమూర్తి, మాతే ఖుషి తదితరులు పాల్గొన్నారు.