తెలంగాణ రణ నినాదాన్ని చాటినవాడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్

  • జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్

పాలకుర్తి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గం నాయకులు మేడిద ప్రశాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేడిద ప్రశాంత్ మాట్లాడుతూ… తెలంగాణ పోరాట ఘటనలో జై జయశంకర్, జై తెలంగాణ నిరంతరం వినపడిన నినాదాలు. అతని పేరే ఒక నినాదం, తెలంగాణ రూపకర్త తనే. అతని లేని లోటు తెలంగాణలో పూడ్చలేనిది. తెలంగాణ అనే మట్టిని ముద్దలు ముద్దలుగా చేసి ఆశయానికి ప్రాణం పోసి కాలువలుగా పాయలైన వివిధ బావ సరూపత్వా గల సంస్థలు “తెలంగాణ రణ నినాదం” అనే మైదానంలోకి మళ్ళించి జన సముద్రం చేసినవారు ఆచార్య జయశంకర్. నమ్మిన సిద్ధాంతాల కోసం తను నడిచే దారిలో ఆటుపోట్లు ఎదురైనా, ఒంటరైనా సర్వజనుల సంక్షేమాన్ని మరువని ఒక మార్గం నిర్దేశకుడు ఆచార్య జయశంకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల సైదులు, పూజారి సాయి, ఎన్ రవి, మాడరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.