దీపావళి కానుకగా ఆచార్య సెకండ్ సింగిల్… అఫీషియల్

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందింది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, మరో జంటగా చరణ్ – పూజ హెగ్డే అలరించనున్నారు. చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గతంలో చిరూ – మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా ఫస్టు సింగిల్ గా వచ్చిన ‘లాహే లాహే’ సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట జనంలోకి దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను వదలనున్నారు. చరణ్ – పూజ హెగ్డే లపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ మెలోడీ గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో సిద్ధా పాత్రలో చరణ్ .. ‘నీలాంబరి’ పాత్రలో పూజ కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నారు .. కానీ కుదరలేదు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సోనూ సూద్ .. జిషు సేన్ గుప్తా .. సౌరవ్ లోకేశ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.