టీ20వరల్డ్ కప్: శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. షార్జా వేదికగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో హసరంగ (34) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు. అంతకు ముందు, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (101) సెంచరీ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40) రాణించాడు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ 3, దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టారు