క్రియాశీలక సభ్యులు జనసేన గెలుపుకు సహకరించాలి: మిడితాన ప్రసాద్

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు నాయకత్వంలో పాలకొండ మండలం జనసేన పార్టీ నాయకులు మిడితాన ప్రసాద్ ఆదివారం బెజ్జి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులును ఉద్దేశించి మాట్లాడుతూ.. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించి జనసేన పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు.