క్రియాశీలక సభ్యత్వం మీ కుటుంబానికి జనసేన అండ

పాలకొండ నియోజకవర్గ, జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన జానీ మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేది నుంచి మార్చ్ 3వ తేది వరకు నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం అలాగే గత రెండు సంవత్సరాలుగా తీసుకున్న సభ్యత్వం రెన్యువల్ చేయించుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమంలో వాలంటీర్స్ అందరూ తమ బాద్యతలను సక్రమంగా నిర్వహించడం జరిగింది. అలానే నాకు సహాయ సహకారం అందించిన నాతోటి జనసైనికులు మరియు వీరమహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు అలానే ఈ కార్యక్రమం చివరి రోజు భాగంలో పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం గెడగాం గ్రామంలో సభ్యత్వ కార్యక్రమం ముగించడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వం ప్రపంచంలో ఏ పార్టీ చేపట్టనటువంటి కార్యక్రమం మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా మరియు తోడుగా ఉంటుంది అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని వారికి కలిగిస్తుంది అని జనసేన జానీ చెప్పడం జరిగింది.