Vizag: కూర్మన్నపాలెంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కిట్ల పంపిణీ

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూర్మన్నపాలెం 86వ వార్డ్ జనసేన పార్టీ ఆఫీసులో కాదా శ్రీను ఆధ్వర్యంలో క్రియాశీలక కార్యకర్తలకు కిట్లు(బీమా పత్రాలు) అందజేయడం జరిగింది. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు.