నెల్లూరు రూరల్ లో శరవేగంగా సాగుతున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు

  • కార్యకర్తల శ్రేయస్సును కోరే జనసేన పార్టీలో మేము కూడా భాగస్వామ్యులమవుతాం అంటూ నెల్లూరు రూరల్ 34 డివిజన్ నుంచి లక్ష్మీ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్న మహిళలు..

నెల్లూరు రూరల్: మరో ఎనిమిది రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు 3వదశ ముగినన్న తరుణంలో జెండా పట్టుకుని జెండా పట్టుకుని మోసే కార్యకర్తల శ్రేయస్సు కోరే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు మేము సైతం జనసేన పార్టీలో చేరి పనిచేస్తామంటూ మహిళలు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. కార్యకర్తల కోసం సొంత నిధుల నుంచి డబ్బులు వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు వారికి ప్రమాద బీమా మరియు జీవిత బీమా కల్పిస్తున్నారు. దేశంలోని మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ చేపట్టిన నాయకులు, మద్దతుదారులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మేము కూడా జనసేన కుటుంబ సభ్యులఅని తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరో ఎనిమిది రోజుల్లో ముగియనున్న జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదులో అందరినీ భాగస్వామ్యం చేసి జనసేన కార్యకర్తల ఆపద సమయాల్లో తమకు తోడుగా జనసేన పార్టీ ఉందని తెలపాల్సిందిగా చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో పాటు లక్ష్మీ, మాధవి, రమణమ్మ, సునీత, యశోద, షభన, భీమా, సుబ్బు, ప్రశాంత్ గౌడ్, బాలాజీ, ఖలీల్, ఆలేఖ్, హరి, తదితరులు పాల్గొన్నారు.