113వ రోజుకు చేరుకున్న పవనన్న ప్రజా బాట

  • అరాచకపాలనకు చరమగీతం పడాలి
  • రాజంపేట జనసేన నాయకులు

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు నందలూరు మండలంలోని పలు గ్రామాలలో సాలిపేట, తొగురుపేట, రామచంద్రాపురం, కే రాచపల్లి, ఎర్రిపాయపల్లి, నారాయణ రాజుపేటలో 113వ రోజు ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ కరపత్రాలను అందించి జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భాస్కర పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, గోపి, చౌడయ్య, నారా కిషోర్, జనసేన వీరమహిళలలు జడ్డ శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.