నందికొట్కూరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

నందికొట్కూరు: నందికొట్కూరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రజలు క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకోవాలని జనసేన పార్టీ కార్యాలయం నుండి నల్లమల రవికుమార్, మద్దిలేటి, మొలక శేషు, పగడం శేషన్నలను కోరడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వ ప్రయోజనాలను వివరిస్తూ.. క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న వారికి చాలా ఉపయోగాలు ఉంటాయని, కుటుంబంలో సభ్యత్వం చేయించుకున్నవారు యాక్సిడెంట్ వల్ల మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడకుండా ఐదు లక్షల రూపాయలు ఈ బీమా ద్వారా కుటుంబానికి వస్తాయని తెలియజేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలియజేశారు.. పల్లెటూర్లలో జనసేన పార్టీ కార్యక్రమాలు జరిగే సమయంలో ప్రజలు కుటుంబ పెద్ద యాక్సిడెంట్ వల్ల చనిపోయారని అప్పటినుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని, పిల్లల చదువులు చదివించలేకపోతున్నామని, కష్టాలు ఉన్నాయని తెలియజేశారు. అందువల్ల ఇలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదని జనసేన పార్టీ భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకు రావడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వాన్ని తీసుకొని ముందు జాగ్రత్త వహించవలసిందిగా తెలియజేశారు.