గొన్నవానిపాలెంలో జోరుగా సాగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

గాజువాక: జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ జనసైనికుల కుటుంబ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐదు లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో కూడిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గొన్నవానిపాలెంలో జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి గొన్న రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం వద్ద సోమవారం ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, ముఖ్యంగా అధిక సంఖ్యలో వివిధ గ్రామాల మహిళలు స్వచ్ఛందంగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85 వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు, పి వసంత్, పి వసంత్ కుమార్, గొన్న గణేష్, పెదిరిల్ల ప్రసాద్, నవీన్, హేమంత్, బాలాజీ, కళ్యాణ్, శ్రీమతి భారతి, శ్రీమతి పల్లి పార్వతి, శ్రీమతి సౌమ్య, ప్రసన్న, శ్రీమతి సిరపనశెట్టి లక్ష్మి, శ్రీమతి శివ పార్వతి, శ్రీమతి మట్టా ఈశ్వరమ్మ, అధిక సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.