ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదులు ఏర్పాటు చేయాలి: జనసేన

బోనకల్ మండల జనసేన పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బోనకల్ ప్రాథమిక వైద్యాఆరోగ్య కేంద్రంలో అదనపు గదులు ఏర్పాటు చేయాలని వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ కి వినతి పత్రఒ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరీ డేవిడ్ మాట్లాడుతూ.. మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉన్నాయి మండల పరిధిలో 50,000 జనాభా కలిగి ఉన్న మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషంట్ల సంఖ్య పెరుగుతుంది. అదనపు గదులు లేక ప్రజలు ఇబ్బంది పడతూ ఉన్నారు. కావున అదనపు గదులు ఏర్పాటు చేయాలని.. ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని బోనకల్ మండల ప్రజల తరఫున బోనకల్ మండలం జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి ఎస్కే బాజీ బాబా, తదితరులు పాల్గొన్నారు.