అగ్నిప్రమాద బాధితునికి నిత్యావసరాలతో మనోధైర్యాన్నిచ్చిన అయినవిల్లి జనసేన

అయినవిల్లి మండలం మూలపాలెం గ్రామంలో నేదునూరి గణపతి పాటి సూర్యనారాయణలకు సంబంధించిన రెండు పూరిళ్ళు అగ్నికి ఆహుతి అవ్వడం జరిగిందని తెలుసుకుని జనసేన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు సంఘటనా స్థలాన్ని చూసి వారికి నిత్యావసర సరుకులు మరియు రైస్ ప్యాకెట్లు జనసేన పార్టీ అయినవిల్లి మండలం ద్వారా అందజేయడం జరిగింది. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున మీకు న్యాయం జరగకపోతే జనసేన ముందుండి పోరాడుతుందని తెలియజేశారు. అగ్నికి ఆహుతి అయిన వారు త్వరగా కోలుకుంటారని కోలుకోవాలని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్ద చంటిబాబు, పెంటపాటి రవి నాయుడు, సర్పంచులు సలాది బుచ్చిరాజు, మేడిద దుర్గా ప్రసాద్, ఎంపిటిసి సభ్యులు అడపా నాగభూషణం, కుప్పాల రాంబాబు, గుర్రాల రాంబాబు, అయినవిల్లి ఉప సర్పంచ్ పోలిశెట్టి రాజేష్, పెంట శ్రీనివాస్ నాయుడు, సలాది శ్రీరామ్ దామిశెట్టి రాజా, పడాలి గిరి, కోలా నాగు పాల్గొనడం జరిగింది.